హర్మూజ్ మీదుగా వెళ్లే నౌకలకు టోల్ ఛార్జ్: కీలక నిర్ణయం దిశగా ఇరాన్

  • హర్మూజ్ జలసంధిని నియంత్రిస్తున్న ఇరాన్
  • టోల్ ఛార్జ్ వసూలు చేయాలని ఆలోచన 
  • నౌకలపై టోల్ విధింపు ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్న చట్టసభ సభ్యుడు
  • ఇరాన్ ప్రభుత్వానికి టోల్ ట్యాక్స్ కట్టేలా బిల్లు తీసుకురావాలని యోచిస్తున్నట్లు వెల్లడి
హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లే నౌకలకు టోల్ ఛార్జ్ వసూలు చేయాలని ఇరాన్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల్లోని 20 శాతం చమురు రవాణా ఈ జలసంధి మీదుగానే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ టోల్ ఛార్జ్ వసూలు చేయాలనే ఆలోచన చేస్తోందని తెలుస్తోంది.

హర్ముజ్ మీదుగా వెళ్లే నౌకలపై టోల్ విధించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఇరాన్ చట్టసభ సభ్యుడు ఒకరు స్థానిక మీడియాతో తెలిపారు. నౌకాయానం, ఇంధన రవాణా, ఆహార సరఫరా కోసం హర్ముజ్‌ను ఉపయోగించుకునే దేశాలు ఇక నుంచి ఇరాన్‌కు టోల్ ట్యాక్స్ కట్టేలా బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.

యుద్ధం ముగిసిన తర్వాత హర్మూజ్‌కు కొత్త విధివిధానాలు వస్తాయని ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. మాపై ఆంక్షలు విధించిన దేశాలపై అలాంటి విధంగానే మేము కూడా చర్యలు తీసుకునేలా నిర్ణయాలు ఉంటాయని తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు మాత్రమే హర్మూజ్‌ను మూసివేసినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి ఇటీవల ప్రకటించారు.

Iran
Hormuz Strait
Strait of Hormuz
Oil Transportation
Toll Charges
Shipping
Middle East
Persian Gulf

More Telugu News